చంద్రబాబుపై తలసాని తీవ్ర విమర్శలు

దేశంలో అత్యధికంగా అవినీతి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… తాను ఎటువైపు [more]

Update: 2019-02-14 05:59 GMT

దేశంలో అత్యధికంగా అవినీతి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… తాను ఎటువైపు ఉంటే ప్రజలందరూ అటువైపే ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో మోడీని పొగిడి ఇప్పుడు తిడుతున్నారని, అసెంబ్లీలో హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో డబ్బు పెట్టి గెలవవచ్చనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని, తెలంగాణలో ఏపీ నుంచి రూ.500 కోట్లు తీసుకెళ్లి చంద్రబాబు ఖర్చు పెట్టినా ఓడిపోయారన్నారు. టీవీలు, పత్రికల్లో ప్రచారం తప్ప ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో అభివృద్ధి లేదన్నారు. ఏపీ సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో కూడా ఏపీకి న్యాయం చేయాలని కోరామని తెలిపారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారని విమర్శించారు.

Tags:    

Similar News