దీక్ష చేస్తున్న ఎంపీలకు టీ ఇచ్చిన డిప్యూటీ ఛైర్మన్

నిన్న సభ నుంచి సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష చేస్తున్నారు. రాజ్యసభలో నిన్న 8 మంది సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి [more]

Update: 2020-09-22 03:29 GMT

నిన్న సభ నుంచి సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష చేస్తున్నారు. రాజ్యసభలో నిన్న 8 మంది సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్స్ మొత్తానికి వారిని సస్పెండ్ చేశారు. తమ సస్పెన్షన్ అనైతికమని, అప్రజాస్వామ్యకమని ఆరోపిస్తూ వారంతా పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష చేస్తున్నారు. దీక్ష చేస్తున్న ఎంపీలకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ స్వయంగా టీ తీసుకుని వచ్చారు. దీక్ష చేస్తున్న ఎంపీలకు టీ ఇచ్చారు.

Tags:    

Similar News