భూములిస్తామంటే లక్షకోట్లు అడగండి

రైతులు లక్ష కోట్ల పరిహారం అడగాలని రాజధాని రైతులకు సుజనా చౌదరి పిలుపు నిచ్చారు. పొరపాటున జగన్ సీఎం అయ్యారన్నారు. రాజధాని అమరావతిని కాపాడేందుకు బీజేపీ రైతులకు [more]

Update: 2019-12-29 08:12 GMT

రైతులు లక్ష కోట్ల పరిహారం అడగాలని రాజధాని రైతులకు సుజనా చౌదరి పిలుపు నిచ్చారు. పొరపాటున జగన్ సీఎం అయ్యారన్నారు. రాజధాని అమరావతిని కాపాడేందుకు బీజేపీ రైతులకు అండగా ఉంటుందన్నారు. అవసరమైతే తాము కూడా న్యాయపోరాటం చేస్తామన్నారు. రాజధాని మార్చడం అంత సులువు కాదని జగన్ తెలుసుకోవాలన్నారు. రాజధాని రైతులతో ఆయన మాట్లాడారు. ఏ సమయంలోనైనా సాయం కోసం తన ఇంటి తలుపు తట్టవచ్చునని కోరారు. బీజేపీ అన్నిరకాలుగా రాజధాని రైతులకు అండగా ఉంటుందన్నారు. రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు తర్వగా చేయకపోవడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందన్నారు. రెండుప్రభుత్వాలూ రైతులకు అన్యాయం చేశాయన్నారు. ఒకవేళ ప్రభుత్వం తిరిగి భూములు ఇచ్చేస్తామంటే లక్షకోట్ల రూపాయల పరిహారం అడగాలని సుజనాచౌదరికోరారు. రాజధాని కోసం పోరాటం ఆపవద్దని సూచించారు.

Tags:    

Similar News