శ్రీనివాసరావు భద్రతపై కోర్టు ఆదేశాలు

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. విజయవాడ జైలులో శ్రీనివాసరావుకు భద్రత [more]

Update: 2019-01-18 08:32 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. విజయవాడ జైలులో శ్రీనివాసరావుకు భద్రత లేదని, ప్రాణహాని ఉందని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనలను కోర్టు అంగీకరించింది. శ్రీనివాసరావును ప్రత్యేక భద్రత మధ్య రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 25 వరకు అతడికి రిమాండ్ విధించింది. వారం రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News