పెరుగుతున్న కేసులతో లాక్ డౌన్ పొడిగిస్తారా?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ లోనే 38 కేసులు నమోదయ్యాయి. పహాడీ షరీఫ్ [more]

Update: 2020-05-27 02:50 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ లోనే 38 కేసులు నమోదయ్యాయి. పహాడీ షరీఫ్ లో ఒక మటన్ వ్యాపారి విందు చేసుకోవడంతో వారి ఇంట్లో 14 మందికి కరోనా వైరస్ సోకింది. రంగారెడ్డి జిల్లాలో ఏడు, మేడ్చల్, మల్కాజిగిరిలో ఆరు కేసులు నమోదయ్యాయి. తాజాగా సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991కు చేరుకుంది. 57 మంది కరోనా కారణంగా ఇప్పటి వరకూ మరణించారు. నేడు కేసీఆర్ లాక్ డౌన్ పై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. లాక్ డౌన్ ను మరింత పొడిగించే అవకాశముంది.

Tags:    

Similar News