వండర్ చేసిన తల్లీకొడుకులు

Update: 2018-10-02 10:57 GMT

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన ఓ పని ఆశ్చర్యం కలిగించింది. మహాత్మా గాంధీ 150 జయంతి సందర్భంగా మహారాష్ట్ర వార్ధాలోని మహాత్మా గాంధీ ఆశ్రమంలో సోనియా, రాహుల్... మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ సభ కూడా జరిగింది. అనంతరం నేతలందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, భోజనం చేసిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారు తిన్న ప్లేట్లను స్వయంగా కడిగారు. దీంతో మిగతా నేతలు కూడా వారి ప్లేట్లను వారే కడగాల్సి వచ్చింది.

Similar News