బాబుకు అన్ని సీట్లు మించి...?

Update: 2018-11-02 08:44 GMT

చంద్రబాబుపై ఎన్టీఆర్ కుటుంబం తిరుగుబాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు రాజకీయ దళారి అని, ఏ ఎండకా గొడుగు పట్టగలరని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 30 సీట్లకు మించిరావని సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఏపీలో రావాల్సిన ప్రభుత్వమే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని వీర్రాజు అన్నారు. చంద్రబాబు కేవలం రాజకీయ స్వార్థంతోనే కాంగ్రెస్ తో జతకట్టారని, దానివల్ల పార్టీకి లాభం చేకూరేకన్నా, నష్టమే ఎక్కవని చెప్పారు. ఏపీలో తెలుగుదేశం పని అయిపోయిందన్నారు.

Similar News