ఏపీపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని కేంద్రానికి [more]

Update: 2021-07-31 03:06 GMT

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని కేంద్రానికి సమర్పిస్తామని సోము వీర్రాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికి తాళం పడినట్లయిందని ఆయన ఎద్దేవా చేశారు. నదీజలాల విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Tags:    

Similar News