వైసీపీ సర్కార్ పై సోము వీర్రాజు ఫైర్

వైఎస్ జగన్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుందన్నారు. త్రిపురాంతకంలో ఎస్టీలు చర్చికి రాలేదని వైసీపీ [more]

Update: 2021-07-26 05:51 GMT

వైఎస్ జగన్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుందన్నారు. త్రిపురాంతకంలో ఎస్టీలు చర్చికి రాలేదని వైసీపీ నేతలు దాడి చేసినా వారిపై ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని సోము వీర్రాజు మండిపడ్డారు. హిందువులకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించినా జగన్ మౌనంగా ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం దేవస్థానంలోనూ అన్యమతస్థులకు దుకాణాలను కేటాయించడం పట్ల సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News