బీజేపీ రథయాత్ర వాయిదా

బీజేపీ, జనసేన రథయాత్ర వాయిదా పడింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చేపట్టాల్సిన రధయాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఫిబ్రవరి 4వ [more]

Update: 2021-01-26 12:46 GMT

బీజేపీ, జనసేన రథయాత్ర వాయిదా పడింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చేపట్టాల్సిన రధయాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతిలోని కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ రధయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సోము వీర్రాజు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ రధయాత్ర కొనసాగే అవకాశముంది.

Tags:    

Similar News