ఇప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయ్

ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వంపై దాడులు పెరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతర్వేదిలో రధం దగ్దంతో అందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పిచ్చివాళ్లు ఎందుకు హిందూ [more]

Update: 2020-09-08 06:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వంపై దాడులు పెరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతర్వేదిలో రధం దగ్దంతో అందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పిచ్చివాళ్లు ఎందుకు హిందూ మతంపైనే దాడులు చేస్తున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోక పోవడం వల్లనే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సోము వీర్రాజు కోరారు. ఇప్పుడే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం ఆలోచించుకోవాలని కోరారు.

Tags:    

Similar News