గవర్నర్ కూడా భయపడిపోయినట్లుందే?

గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ కూడా వైసీపీ ప్రభుత్వానికి భయపడిపోతున్నట్లుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగిస్తూ [more]

Update: 2020-04-12 07:56 GMT

గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ కూడా వైసీపీ ప్రభుత్వానికి భయపడిపోతున్నట్లుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆర్డినెన్స్ పై గవర్నర్ ఎలా సంతకం పెట్టారని సోమిరెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ తరహాలోనే గవర్నర్ కు కూడా బెదిరింపులు వచ్చినట్లుందని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని గంట కూడా ఆపలేకపోయారని సోమిరెడ్డి విమర్శించారు. ఇదంతా చూస్తుంటే గవర్నర్ ను కూడా వైసీపీ నేతలు భయపెట్టినట్లుందన్నారు.

Tags:    

Similar News