వారిద్దరి లాలూచీ వల్లనే సీమకు నష్టం

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాలూచీ పడటం వల్లనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనమేంటని ఆయన [more]

Update: 2021-07-24 04:43 GMT

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాలూచీ పడటం వల్లనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులపై బచావత్ ట్రైబ్యునల్ ఏపీకి కల్పించిన హక్కులు కోల్పోయే అవకాశం ఏర్పడిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అన్ని పార్టీలు ఏకమై సమిష్టిగా పోరాడితేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News