ఎన్నికలకు ముందే బీజేపీకి ఎదురుదెబ్బ

Update: 2018-11-02 09:00 GMT

భారతీయ జనతా పార్టీకి ఎన్నికలకు రెండు రోజుల ముందే ఓ జంప్ జిలానీ ఊహించని షాక్ ఇచ్చారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన రామనగర స్థానానికి ఉపఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ నుంచి కుమాస్వామి భార్య అనిత పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్ నుంచి చేరిన ఎల్.చంద్రశేఖర్ కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీఎం లింగప్ప కుమారుడు. 15 రోజుల క్రితమే పార్టీలో చేరగా బీజేపీ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది.

నన్ను బలిపశువును చేశారు...

అయితే, ఊహించని పరిణామాల్లో ఆయన ఎన్నికలకు రెండు రోజులే ఉందనగా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి తన మద్దతును జేడీఎస్ అభ్యర్థి అనీతకు ప్రకటించారు. దీంతో బీజేపీ షాక్ తిన్నది. తన ఎన్నికను బీజేపీ నాయకులు నిర్లక్ష్యం చేశారని, ఎవరూ ప్రచారానికి రాలేదని, తనను బలిపశువును చేశారని, అందుకే పోటీ నుంచి విరమించుకుని జేడీఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు చంద్రశేఖర్ ప్రకటించారు దీంతో అనీత గెలుపు ఖాయమే అయ్యింది. ఈ ఘటన చూసేనా అఖరి నిమిషంలో జంప్ చేసే జిలానీలకు టిక్కెట్లు ఇవ్వకుండా పార్టీలు మారుతాయో లేదో చూడాలి.

Similar News