సీఎం రమేష్ ను ఇరికించిన విజయసాయిరెడ్డి

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్ [more]

Update: 2019-04-30 13:37 GMT

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్ లో నిర్మించిన కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు కేంద్రం ఈ మేరకు స్పందించింది. ఈ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, సీబీఐ చేత విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రం విచారణ జరపాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News