చెల్లి బాధ చూడలేకే… నెలరోజుల ముందే హత్యకు ప్లాన్

హేమంత్ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన చెల్లెలి బాధను చూడలేకనే హేమంత్ ను హత్య చేశానని ప్రధాన నిందితుడు యుగంధర్ రెడ్డి పోలీసుల [more]

Update: 2020-09-26 08:35 GMT

హేమంత్ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన చెల్లెలి బాధను చూడలేకనే హేమంత్ ను హత్య చేశానని ప్రధాన నిందితుడు యుగంధర్ రెడ్డి పోలీసుల విచారణ లో చెప్పారు. హేమంత్ హత్యకు నెలరోజుల ముందే ప్లాన్ చేశారు. అనేకసార్లు రెక్కీ నిర్వహించినట్లు పేర్కొన్నాడు. కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషాలతో అనేకసార్లు హత్య విషయంలో చర్చించారు. అవంతి పెళ్లి చేసుకు వెళ్లిపోయిన తర్వాత తన చెల్లి అర్చన, బావ లక్ష్మారెడ్డి ఇంటి నుంచి బయటకు రాలేదు. అర్చన తన సోదరుడైన యుగంధర్ రెడ్డి ముందు తనబాధను చెప్పుకుంది. గారాబంగా పెంచుకున్న పిల్లను ఎగరేసుకుపోయాడంటూ విలపించింది. దీంతో చెల్లి బాధను చూసిచలించిన యుగంధర్ రెడ్డి హేమంత్ హత్యకు ప్లాన్ చేశాడు. అయితే ఈ హత్యకేసులో 13 మందికి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు.

Tags:    

Similar News