బాబుపై అలిగిన సీనియర్ నాయకుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అలకపాన్పు ఎక్కారు. అధినేత చంద్రబాబుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి పరిణామాలతో పార్టీలో తనకు [more]

Update: 2019-02-16 08:48 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అలకపాన్పు ఎక్కారు. అధినేత చంద్రబాబుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి పరిణామాలతో పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయన ఇవాళ జరుగుతున్న పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యారు. మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ పార్టీలో చేరికపై కూడా తనకు సమాచారం ఇవ్వలేదని అశోక్ బాధపడుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయన భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. అసలే, వలసలతో ఇబ్బంది పడుతున్న సమయంలో అశోక్ గజపతి రాజును చంద్రబాబు ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

Tags:    

Similar News