బ్రేకింగ్: వైసీపీలో చేరనున్న సీనియర్ నేత

కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డీఎల్ రవింద్రారెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, [more]

Update: 2019-03-20 06:12 GMT

కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డీఎల్ రవింద్రారెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురామిరెడ్డి తదితరులు ఇవాళ డీఎల్ ను కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఎల్లుండి పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ ఓటమే తన లక్ష్యమని ప్రకటించారు. వాస్తవానికి, ఆయన మైదుకూరు టిక్కెట్ ఇస్తే వైసీపీలో చేరుతానని ముందే చెప్పారు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి ఉన్నందున ఆయనకు వైసీపీ టిక్కెట్ పై హామీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన పార్టీలో చేరడం ఖాయమైంది.

Tags:    

Similar News