బ్రేకింగ్ : హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

వరంగల్ లో తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ [more]

Update: 2020-10-28 08:39 GMT

వరంగల్ లో తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో తొమ్మిది మందికి ఆహారంలో మత్తు మందు కలిపి ఆ తర్వాత హత్య చేశాడు. లాక్ డౌన్ సమయంలో జరిగిన తొమ్మిది మంది హత్య సంచలనం సష్టించింది. అయితే ఐదు నెలల్లోనే కేసును విచారించిన పోలీసులు నిందితుడు సంజయ్ కుమార్ కు శిక్ష పడేలా చేశారు. మే 21న వరంగల్ జిల్లా గొర్రకుంట్లలో ఈ సంఘటన జరిగింది. 25 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో ఛార్జి షీట్ దాఖలు చేశారు.

Tags:    

Similar News