పని లేని చంద్రబాబుకు ఇక అదే పని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వేరే పనిలోకి ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై చంద్రబాబు జగన్ [more]

Update: 2021-06-17 12:46 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వేరే పనిలోకి ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై చంద్రబాబు జగన్ కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. తన పరిపాలనలో రైతు ప్రయోజనాలను పూర్తిగా విస్మరించింది చంద్రబాబు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు హయాంలోని బకాయీలను తమ ప్రభుత్వమే చెల్లిందన్నారు. చంద్రబాబు పాలన రైతులకు చీకటి రోజులని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రైతు ప్రయోజనాల కోసమే పాటుపడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Tags:    

Similar News