మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సాగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆరు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లారన్నారు. జగన్ [more]

Update: 2021-06-11 12:59 GMT

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సాగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆరు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లారన్నారు. జగన్ ఢిల్లీ పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలనే జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించారన్నారు. జగన్ ఐదుగురు కేంద్రమంత్రులను కలిశారన్నారు. చంద్రబాబు గతంలో ఢిల్లీ పర్యటన చేసినప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకునేవారన్నారు. కేసులను కొట్టించుకేనేందుకే ఢిల్లీ వెళ్లే పనైతే ఇప్పటి వరకూ ఎందుకు కొట్టేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించారన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు త్వరలో ఖాయమని సజ్జల తెలిపారు. దీనికి కేంద్ర నుంచి సహకారం కూడా లభిస్తుందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News