అసెంబ్లీ లో ఇచ్చిన తీర్పే రిపీట్ అయింది

రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మరోసారి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 80 శాతం [more]

Update: 2021-02-23 01:12 GMT

రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మరోసారి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 80 శాతం పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధదినేత చంద్రబాబు అబద్ధపు ప్రచారాలను ఇప్పుడు కూడా వదిలిపెట్టడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంత జరిగినా చంద్రబాబు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని ప్రశ్నించారు. తాము ఫొటోలతో సహా విజేతల జాబితాను వెబ్ సైట్ లో పెట్టామని, ఒకసారి చంద్రబాబు చూసుకుంటే మంచిదని హితవు పలికారు.

Tags:    

Similar News