సబ్బం హరి జోస్యం విన్నారా?

Update: 2018-12-12 08:34 GMT

మరోసారి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబునాయుడు కావడం ఖాయమని మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి జోస్యం చెప్పారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తప్ప ఏపీకి మరెవరూ సీఎం కాలేరన్నారు. చంద్రబాబు గిఫ్ట్ ఇవ్వడం వల్లనే కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి అయ్యారన్నారు. అలాగే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ తో చంద్రబాబు మళ్లీ సీఎం అవ్వడం ఖాయమన్నారాయన. బీజేపీ చంద్రబాబును మరోసారి సీఎం కాకుండా అడ్డుకుంటోందన్నారు. తాను ఐదేళ్ల విరామం తర్వాత ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వస్తున్నానని, ఏ పార్టీలో చేరీదీ త్వరలో ప్రకటిస్తానని సబ్బం హరి తెలిపారు.

Similar News