మంచిర్యాలలో ఆర్టీసీ బస్సు బోల్తా

మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ప్రమాదం [more]

Update: 2019-05-17 11:03 GMT

మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో సుమారు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News