టీడీపీకి కొత్త పేరు పెట్టిన రోజా

Update: 2018-11-05 07:45 GMT

జాతీయ రాజకీయాల్లో ఐరెన్ లెగ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న వారంతా రిటైర్డ్ అయిపోయారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చిన్న వయస్సులోనే రిటైర్డ్ కావాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... జగన్ పై హత్యాయత్నం కేసును నీరుగార్చే విధంగా విచారణ జరుపుతున్నారని ఆమె ఆరోపించారు. నిందితుడి కాల్ డేలాపై పెట్టిన శ్రద్ధ టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరిపై పెట్టలేదని పేర్కొన్నారు. జనవరి నుంచి కత్తి హోటల్ లో ఎందుకు దాచారని ఆమె ప్రశ్నించారు.

తెలుగు దాల్ పప్పుగా.....

జగన్ కు బయట నుంచి ఫుడ్ రావద్దని ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాస్ అన్నయ్య, కుటుంబసభ్యులంతా టీడీపీ కార్యకర్తలమని చెప్పాడని గుర్తు చేశారు. టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోయిందని, తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీని తెలుగు దాల్ పప్పుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. హత్యాయత్నం జరిగిన తర్వాత జగన్ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తిస్తే చంద్రబాబు మాత్రం వెకిలిగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి చంద్రబాబును శునకానంద పార్టీ అధ్యక్షుడిగా పిలవాలన్నారు. వైఎస్ జగన్ కి వస్తున్న ఆదరణ చూడలేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Similar News