రోజాకు రాజధాని సెగ

రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను రైతులు అడ్డుకున్నారు. నీరుకొండ ఎస్ఆర్ఎం వర్సిటీ సమ్మిట్ పాల్గొనేందుకు ఆర్కే రోజా వచ్చారు. రోజా రాకను [more]

Update: 2020-02-20 06:58 GMT

రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను రైతులు అడ్డుకున్నారు. నీరుకొండ ఎస్ఆర్ఎం వర్సిటీ సమ్మిట్ పాల్గొనేందుకు ఆర్కే రోజా వచ్చారు. రోజా రాకను గమనించిన మహిళా రైతులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ నినాదాలు చేశారు. ఆమె వాహనం ఎదుట బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని వారు నినాదాాలు చేశారు. పోలీసులు రోజా వాహనం ఎదుట బైఠాయించిన రైతులు, మహిళలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News