ఏపీలో రీపోలింగ్ ఇక్కడే… ఇప్పుడే….!!!

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. జిల్లా రిటర్నింగ్ అధికారుల నుంచి వచ్చిన నివేదికలను అనుసరించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని [more]

Update: 2019-05-02 01:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. జిల్లా రిటర్నింగ్ అధికారుల నుంచి వచ్చిన నివేదికలను అనుసరించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఐదు చోట్ల రీపోలింగ్ జరపాలని నిర్ణయించింది. రీపోలింగ్ ఈ నెల 6వ తేదీన జరగనుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేసరపల్లి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పల్లెపాలంలోని ఇసుకపల్లి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకాని తిప్ప, ప్రకాశం జిల్లా యర్రగొండలపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో ఈ నెల 6న రీపోలింగ్ జరగనుంది. ఈ నెల 11వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఈ పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తడంతో ఎన్నికల కమిషన్ రీపోలింగ్ కు ఆదేశించింది.

Tags:    

Similar News