ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో.....!

Update: 2018-08-03 02:24 GMT

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో హోటల్ గదిలో మరణించాడు.. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాప్ర ఎల్లారెడ్డి గూడకు చెందిన సాయికిరణ్ యాదవ్ (37) రియల్ ఎస్టేట్ వ్యాపారి.ఆయనకు భార్య స్రవంతి, రెండున్నర సంవాత్సరాల కుమార్తె ఉన్నారు. ఈ నెల 1వ తేదీన ఆయన సికింద్రాబాద్ లోని బెల్సన్ తాజ్ హోటల్ లోని 305లో దిగాడు. అప్పటి నుంచి బయటకు రాలేదు. సాయి కిరణ్ బంధువు మనోజ్ శుక్రవారం ఉదయం హోటల్ కు వచ్చి తలుపులు కొట్టినా తీయ లేదు. హోటల్ సిబ్బందిని అడిగితే ఆ గదికి మరొకరు వచ్చారని తప్పుడు సమాచారం ఇవ్వడంతో మనోజ్ వెళ్లి పోయాడు. రాత్రి 9.30 గంటల సమయంలో హోటల్ సిబ్బంది గది తలుపులు తట్టినా తీయక పోవడంతో గది తలుపులు తెరిచి చూడగా ఆయన చనిపోయి ఉన్నాడు.వెంటనే మహంకాళి పోలీసులకు సమచారం ఇవ్వడంతో ఇన్స్ పెక్టర్ రమేష్ అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి నోటి నుంచి రక్తం వస్తుండటం తో విషo తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Similar News