దేశం మొత్తం ఫిదా.. మోదీ కంటే టాటాయే టాప్

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఫొటో వైరల్ అయింది. దేశ వ్యాప్తంగా నెటిజన్లు రతన్ టాటాకు నీరాజనాలు పడుతున్నారు.గ్రేట్ సర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశీయ [more]

Update: 2020-04-06 04:24 GMT

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఫొటో వైరల్ అయింది. దేశ వ్యాప్తంగా నెటిజన్లు రతన్ టాటాకు నీరాజనాలు పడుతున్నారు.గ్రేట్ సర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా కరోనా వైరస్ కోసం వేల కోట్ల రూపాయల విరాళాలను ఇచ్చారు. తన ట్రస్ట్ నుంచి దాదాపు పదిహేను వందల కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు కరోనా వైరస్ ను అరికట్టేందుకు అవసరమైతే తన ఆరు వేల కోట్లను ఇస్తానని రతన్ టాటా ప్రకటించడంతో దేశమొత్తం ఫిదా అయింది. ఇప్పుడు టాటా ఉత్పత్తులనే కొనుగోలు చేసి మనమూ మద్దతిద్దామంటూ నెటిజన్లు పోస్టులు సోషల్ మీడియాలో ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీపాలు వెలిగించాలన్న మోదీ కంటే రతన్ టాటా ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయ్యారు.

Tags:    

Similar News