ఆ మరణాలపై అనుమానాలున్నాయ్

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ మరణాలపై అనుమానాలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రధానంగా [more]

Update: 2021-06-15 04:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ మరణాలపై అనుమానాలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రధానంగా మే నెలలో సంభవించిన మరణాలపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. మే నెలలో ేవలం మూడు వేల మంది మాత్రమే కరోనాతో మరణించారని ప్రభుత్వం చెబుతోందని, అయితే గత ఏడాది మే నెలకంటే ఈ నెల మేలో అధికశాతం మరణాలు సంభవించాయని రామకృష‌్ణ తెలిపారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News