వర్మ మరికాసేపట్లో

రాంగోపాల్ వర్మ మరొకసారి సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట మరికాసేపట్లో హాజరు కానున్నాడు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కు సంబంధించి వర్మ పైన హైదరాబాద్ [more]

Update: 2019-12-16 04:30 GMT

రాంగోపాల్ వర్మ మరొకసారి సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట మరికాసేపట్లో హాజరు కానున్నాడు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కు సంబంధించి వర్మ పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి రాంగోపాల్ వర్మ ని హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ మేరకు పోలీసుల ఎదుట రామ్ గోపాల్ వర్మ హాజరు కాబోతున్నారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో తనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వర్మ ఉపయోగించారని కేఏ పాల్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పైన కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అంతేకాకుండా మార్ఫింగ్ ఫోటోలు అప్ లోడ్ చేసిన వెబ్ సైట్లకు నోటీసులు జారీ చేశారు. వెబ్ సైట్ల దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ట్విట్టర్లో వర్మ పోస్ట్ చేసిన నేపథ్యంలో అతనికి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ ఫోటో లకు సంబంధించి వర్మను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించబోతున్నారు.

Tags:    

Similar News