కేసీఆర్ తరిమికొడితేనే జగన్ అమరావతి వచ్చాడు

కేసీఆర్ తరిమికొట్టాడు కాబట్టే జగన్ అమరావతికి వచ్చారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ కు ఈసారి కూడా [more]

Update: 2019-05-18 08:41 GMT

కేసీఆర్ తరిమికొట్టాడు కాబట్టే జగన్ అమరావతికి వచ్చారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ కు ఈసారి కూడా భంగపాటు తప్పదని, 23వ తేదీ తర్వాత నరేంద్ర మోడీ గుజరాత్ కు, జగన్ మళ్లీ లోటస్ పాండ్ కు వెళ్లడం తప్పదని జోస్యం చెప్పారు. విజయసాయిరెడ్డి విషపుసాయి రెడ్డిగా మాట్లాడుతున్నారని అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే జగన్ ను, విజయసాయిరెడ్డిని జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. చంద్రగిరి రీపోలింగ్ విషయంలో ఈసీ దారుణంగా వ్యవరిస్తోందని, సీఎస్ వ్యవహారం కూడా అనుమానంగా ఉందని ఆరోపించారు. నరేంద్ర మోడీ చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మలా మారిందన్నారు.

Tags:    

Similar News