లెంప‌లేసుకున్న రాహుల్ గాంధీ..!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు మ‌రోసారి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ కోరారు. న‌రేంద్ర మోడీని చౌకీదార్ చోర్ అని సుప్రీం కోర్టు కూడా [more]

Update: 2019-05-08 05:52 GMT

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు మ‌రోసారి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ కోరారు. న‌రేంద్ర మోడీని చౌకీదార్ చోర్ అని సుప్రీం కోర్టు కూడా అంటోంద‌ని గ‌తంలో ఆయ‌న వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌ను సుప్రీం కోర్టు సీరియ‌స్ గా తీసుకుంది. కోర్టు అన‌ని మాట‌ల‌ను రాహుల్ గాంధీ అన్న‌ట్లు చెప్ప‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది. దీంతో త‌న వ్యాఖ్య‌ల ఉద్దేశ్యం కోర్టుకు ఆపాదించ‌డం కాద‌ని రాహుల్ గాంధీ ఇటీవ‌ల కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. అయినా కోర్టు మాత్రం మెత్త‌బ‌డ‌లేదు. దీంతో లిఖిత‌పూర్వ‌కంగా కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని రాహుల్ ను ఆదేశించింది. దీంతో ఇవాళ కోర్టుకు బేష‌ర‌తు క్ష‌మాప‌ణ చెబుతూ ఆయ‌న అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. త‌న వ్యాఖ్య‌లను త‌ప్పుడా అన్వ‌యించార‌ని రాహుల్ అఫిడ‌విట్ లో కోరారు.

Tags:    

Similar News