ప్రత్యేక హోదాను ఆపే శక్తి ఎవరికీ లేదు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో [more]

Update: 2019-02-22 13:12 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పినందుకు నరేంద్ర మోడీ సిగ్గు పడాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది సామాన్యుడు కాదని.. కోట్లాది మంది ప్రజలకు ప్రతినిధి అయిన ప్రధాని చెప్పారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నది వ్యక్తి కాదని.. దేశమే మాట ఇచ్చినట్లని స్పష్టం చేశారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించారన్నారు. సైనికులపై ఉగ్రదాడి జరిగితే ప్రధాని సినిమా షూటింగ్ లో ఉన్నారని, కెమెరాకు పోజిలిస్తూ నవ్వుతూ కూర్చున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News