ఏపీని రాష్ట్రపతి కాపాడాలి

ఆంధ్రప్రదేశ్ లో న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపిచారు. న్యాయమూర్తులకు వేరే ఉద్దేశ్యాలను ఆపాదిస్తూ ఆ వ్యవస్థను కూడా తమ [more]

Update: 2020-10-13 08:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపిచారు. న్యాయమూర్తులకు వేరే ఉద్దేశ్యాలను ఆపాదిస్తూ ఆ వ్యవస్థను కూడా తమ గ్రిప్ లోకి తీసుకోవాలన్న ప్రయత్నం ఏపీ లో జరుగుతుందన్నారు. అయితే దీనిపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్పందించాల్సి ఉంటుందన్నారు. ఆయనే ఏపీలో జరుగుతున్న అరాచకాలను కాపాడగలరని రఘురామకృష్ణం రాజు అన్నారు. న్యాయమూర్తులను సోషల్ మీడియాలో దూషిస్తున్న కేసు పెట్టని నిస్సిగ్గు చరిత్ర ఏపీ సీఐడిది అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Tags:    

Similar News