రాజుగారి విందులో…?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్లమెంటు సభ్యులకు ఇచ్చిన విందుకు దాదాపు 200 మందికి పైగా ఎంపీలు హాజరయ్యారు. జన్ పథ్ లోని వెస్టన్ [more]

Update: 2019-12-12 02:05 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్లమెంటు సభ్యులకు ఇచ్చిన విందుకు దాదాపు 200 మందికి పైగా ఎంపీలు హాజరయ్యారు. జన్ పథ్ లోని వెస్టన్ కోర్టులో ఇచ్చిన ఈ విందుకు రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అథీర్ రంజన్ చౌదరి కూడా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు ఈ విందుకు హాజరయ్యారు. తెలుగుదేశం, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. గోదావరి రుచులతో వడ్డించిన రుచులను అడిగి తెలుసుకుని మరీ ఎంపీలు ఆరగించారు. పార్టీలకతీతంగా ఎంపీల కోసం ఈ విందును ఏర్పాుట చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Tags:    

Similar News