రఘురామకు సుప్రీంకోర్టులో ఊరట

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గత నెలలో ఇచ్చిన బెయిల్ బాండ్లను ఆమోదించాలని ఆదేశించింది. రఘురామ కృష్ణరాజు రాజద్రోహం నేరంకింద అరెస్ట్ [more]

Update: 2021-08-17 02:46 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గత నెలలో ఇచ్చిన బెయిల్ బాండ్లను ఆమోదించాలని ఆదేశించింది. రఘురామ కృష్ణరాజు రాజద్రోహం నేరంకింద అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యేందుకు లక్ష పూచికత్తు సమర్పించాలని గుంటూరు కోర్టు ఆదేశించింది. అయితే రఘురామ కృష్ణరాజు సమర్పించిన బెయిల్ బాండ్లు కనిపించకపోవడంతో సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని రఘురామ కృష్ణరాజును కింది కోర్టు ఆదేశించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ఆ బాండ్లను ఆమోదించమని ఆదేశించడంతో రఘురామ కృష్ణరాజుకు ఊరట లభించినట్లయింది.

Tags:    

Similar News