జగనూ వారిని కూడా ఐదుగురిని పెట్టుకో

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఐదుగురు ఆర్థికమంత్రులను నియమించుకోవాలన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండగా లేనిది, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న [more]

Update: 2021-08-05 13:05 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఐదుగురు ఆర్థికమంత్రులను నియమించుకోవాలన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండగా లేనిది, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఐదుగురు ఆర్థిక మంత్రులు అవసరమని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. విశాఖలో అనేక భూములను, ఆస్తులను బెదిరించి తమ పరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. రాజకీయాల కారణంగానే అమరరాజా బ్యాటరీస్ పొరుగు రాష్ట్రానికి తరలి వెళ్లిపోతుందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, జగన్ స్కీమ్ ల గురించి ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడమేంటని ఆయన ప్రశ్నించారు. విజయ్ కుమార్ కేంద్ర అటవీశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Tags:    

Similar News