జగన్ కు రాజు లేఖలో ఈసారి అమరావతి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు మరో లేఖ రాశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆయన [more]

Update: 2021-06-21 03:51 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు మరో లేఖ రాశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆయన కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా జగన్ అంగీకరించిన విషయాన్ని తన లేఖలో రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. 30 వేల ఎకరాల్లో రాజధాని ఉండాలని చెప్పిన మాట నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం మార్చుకోవడమేంటని రఘురామ కృష్ణంరాజు లేఖలో నిలదీశారు. మూడు రాజధానుల నిర్ణయం అందిరీని ఆశ్చర్యానికి గురి చేసిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజధాని రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

Tags:    

Similar News