జీతాలా? ఉచితాలా? ఏవి కావాలో తేల్చుకోండి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఉద్యోగుల జీతభత్యాలను కూడా సకాలంలో చెల్లించలేకపోతుందని విమర్శించారు. [more]

Update: 2021-04-05 01:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఉద్యోగుల జీతభత్యాలను కూడా సకాలంలో చెల్లించలేకపోతుందని విమర్శించారు. ఇంతటి దుస్థితి గతంలో ఎప్పుడూ లేదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. చివరకు పింఛనుదారులు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏపీలో నెలకొందన్నారు. ప్రభుత్వ సొమ్మును పప్పు బెల్లాలుగా పంచి పెడుతుండటంతోనే ఈ దుస్థితి తలెత్తిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జీతాలా? ఉచితాలా? ఏవి ముఖ్యమో ప్రజలు గమనించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలే పరిస్థిితి ఎంతో దూరం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Tags:    

Similar News