జగనూ…మనోళ్లు మామూళ్లు కాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణంపై [more]

Update: 2021-07-22 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విశాఖ భూకుంభకోణంపై ఇప్పటికే సిట్ నివేదిక ఇచ్చిందని, నివేదిక ప్రకారం వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సిట్ నివేదికలో పేర్లు ఉన్న వాళ్లతో మనవాళ్లు చేతులు కలిపారన్న అనుమానం కలుగుతుందన్నారు. వైసీపీ నేతలు పెద్దయెత్తున భూ వివాదాల్లో దూరి వాటాల కోసం డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డికి చెందిన ప్రగతి భారతి ట్రస్ట్ లావాదేవీలపై కూడా విచారణ జరిపించాలని, నిందితులకు శిక్షపడేలా చూడాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News