బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే పై దాడి పరిస్థితి ఉద్రిక్తం

విజయనగరం జిల్లా కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై టీడీపీ నేత రామకృష్ణ దాడి చేశారు. విజయనగరం జిల్లా జియ్యపువలస మండలం చినమకుదులో పుష్ప శ్రీవాణి పోలింగ్ [more]

Update: 2019-04-11 11:41 GMT

విజయనగరం జిల్లా కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై టీడీపీ నేత రామకృష్ణ దాడి చేశారు. విజయనగరం జిల్లా జియ్యపువలస మండలం చినమకుదులో పుష్ప శ్రీవాణి పోలింగ్ కేంద్రానికి చేరుకుని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిని ఒక గదిలో నిర్భందించినట్లు సమాచారం. అక్కడ పోలీసులు పెద్దగా లేకపోవడంతో టీడీపీ నేతలు ఆమెను గదిలో నిర్భంధించారని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పుష్పశ్రీవాణికి రక్షణగా నిలిచారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tags:    

Similar News