ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఏపీ బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను బీజేపీ నేతలు కలుస్తున్నారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను [more]

Update: 2021-02-16 00:56 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఏపీ బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను బీజేపీ నేతలు కలుస్తున్నారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్ర ఉక్కుమంత్రిని కలిసిన అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ ను భావిస్తున్నామని చెప్పారు. అయితే దీనిపై కేంద్రానికి అనేక ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. బ్యాంకుల తరహాలో స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థల్లోనే విలీనం చేయాలని సోము వీర్రాజు కోరారు.

Tags:    

Similar News