అప్పుడే లాక్ డౌన్ పై నిర్ణయం

ప్రధాని నరేంద్ర మోదీ అన్ని పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి [more]

Update: 2020-04-08 07:47 GMT

ప్రధాని నరేంద్ర మోదీ అన్ని పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరాావు, కేశవరావులు పాల్గొన్నారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ వంటి విషయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఎంపీ ల్యాడ్స్ లో కోత పెట్టడంపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. లాక్ డౌన్ పొడిగింపు విషయంలోనూ మరికొంతకాలం కొనసాగిస్తేనే మంచిదని పలువురు అభిప్రాయపడినట్లు తెలిసింది. లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేయడం మంచిదని మరికొందరు సూచించారని తెలుస్తోంది. వచ్చే శనివారం ప్రధాని ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. వారి అభిప్రాయాలను ఫైనల్ గా తీసుకున్న తర్వాతే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News