బ్రేకింగ్ : జగన్ కు ప్రధాని మోదీ ఫోన్

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు. కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. జగన్ [more]

Update: 2020-08-09 04:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు. కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. జగన్ ను అడిగి మోదీ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయివేటు ఆసుపత్రి నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో ఈ ప్రమాద ఘటన జరిగిందని జగన్ వివరించారు. మొత్తం ఇప్పటి వరకూ ఈ ప్రమాద ఘటనలో 11 మంది మరణించారని జగన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయని మోదీ జగన్ కు భరోసా నిచ్చారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు యాభై లక్షలు ప్రకటించామని తెలిపారు.

Tags:    

Similar News