బ్రేకింగ్ : భారత్ లో యాభై లక్షలకు చేరువలో కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 83,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,054 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-09-15 04:10 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 83,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,054 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,30,237 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 80,776 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9,90,061 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 38,59,399 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News