కోర్టు ప్రాంగణంలోనే చంపాలని…?

న్యాయవాదుల దంపతుల కేసులో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టు శ్రీను అరెస్ట్ తో వామనరావు హత్య కేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. న్యాయవాది [more]

Update: 2021-02-23 00:55 GMT

న్యాయవాదుల దంపతుల కేసులో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టు శ్రీను అరెస్ట్ తో వామనరావు హత్య కేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. న్యాయవాది వామనరావు దంపతుల హత్యకేసులో బిట్టు శ్రీను ప్రధాన కుట్రదారుడని పోలీసులు చెప్పారు. అసలు వామనరావును కోర్టు ప్రాంగణంలోనే హత్య చేయాలని తొలుత ప్లాన్ వేశారన్నారు. ఆ తర్వాత వామనరావు ఇంటివద్ద కూడా నిందితులు రెక్కీ నిర్వహించారని పోలీసులు చెప్పారు. బిట్టు శ్రీను నిందితులకు కార్లు, ఆయుధాలను సమకూర్చి పెట్టారని, వారిని మహారాష‌‌్ట్రకు పారిపోవాల్సిందిగా సలహా ఇచ్చింది కూడా బిట్టు శ్రీను అని పోలీసులు చెప్పారు. బిట్టు శ్రీను అరెస్ట్ తో వామనరావు హత్య కేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి.

Tags:    

Similar News