విధ్వంసం వెనుక వారే ఉన్నారు..!

కేరళలో జరుగుతున్న పరిణామాలు, విధ్వంసం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. వారే దగ్గరుండి ఉద్రిక్త పరిస్థితిని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. [more]

Update: 2019-01-03 06:34 GMT

కేరళలో జరుగుతున్న పరిణామాలు, విధ్వంసం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. వారే దగ్గరుండి ఉద్రిక్త పరిస్థితిని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. శబరిమలలో సంప్రదాయాలకు విరుద్ధంగా ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశ చేయడంతో రాష్ట్రంలో ఆందోళనలు, విధ్వంసం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలపై విజయన్ మాట్లాడుతూ… తాము సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తున్నామని, మహిళలకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళా భక్తులను అడ్డుకోవడం కోర్టు ధిక్కారణ అవుతుందన్నారు.

రాజకీయ కుట్రలో భాగంగానే…

రాజకీయ కుట్రలో భాగంగానే కేరళలో అల్లర్లు సృష్టించి రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు విధ్వంసంలో 79 బస్సులు, 7 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. విధ్వంసాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తామని హెచ్చరించారు. కేరళ ప్రజలు… మహిళల ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా లేరని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News