విశాఖ కు రాజధాని వెళ్లడం ఖాయం

రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి పేర్ని నాని చెప్పారు. అయితే అమరావతి రైతులు ప్రభుత్వంతో చర్చలకు నిరాకరిస్తున్నారని తెలిపారు. చర్చల [more]

Update: 2021-02-24 02:19 GMT

రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి పేర్ని నాని చెప్పారు. అయితే అమరావతి రైతులు ప్రభుత్వంతో చర్చలకు నిరాకరిస్తున్నారని తెలిపారు. చర్చల కోసం వెళ్లిన మంత్రులపై రైతులు ఇష్టానుసారం మాట్లాడి పంపించి వేశారని పేర్ని నాని తెలిపారు. అయినా జగన్ అమరావతి ప్రాంత అభివృద్ధిక తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆగిపోయిన నిర్మాణలను పూర్తి చేయాాలని జగన్ ఆదేశించారని పేర్ని నాని చెప్పారు. విశాఖలో పరిపాలన రాజధాని రావడం ఖాయమని మంత్రి పేర్నినాని తెలిపారు.

Tags:    

Similar News