బాబూ శవరాజకీయాలు మానుకో

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడ శవం కనపడితే అక్కడ చంద్రబాబు వాలిపోతారన్నారు. శవరాజకీయాలు మానుకుంటే మంచిదని [more]

Update: 2021-04-27 01:05 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడ శవం కనపడితే అక్కడ చంద్రబాబు వాలిపోతారన్నారు. శవరాజకీయాలు మానుకుంటే మంచిదని పేర్ని నాని హితవుపలికారు. కేవలం ఏపీలోనే ఆక్సిజన్ కొరతలేదని, దేశమంతా ఆక్సిజన్ కొరత ఉందని పేర్ని నాని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని పేర్ని నాని తెలిపారు. చంద్రబాబు అవసరమైన సలహాలు ఇవ్వాలని కోరారు. కరోనా రూపం మార్చుకోవడంతోనే సమస్య తలెత్తిందన్నారు.

Tags:    

Similar News